Skip to product information
1 of 4

Aju Publications

Marana Grantham | మరణగ్రంథం

Marana Grantham | మరణగ్రంథం

Regular price Rs. 200.00
Regular price Sale price Rs. 200.00
Sale Sold out
Quantity

‘మౌత్ కీ కితాబ్’ తొలి నవలతోనే ఉర్దూ సాహిత్యంలో పెను సంచలనం సృష్టించి, విశేష పాఠకాదరణ చూరగొన్న రచయిత ఖాలిద్ జావేద్. వందేళ్ళ ఉర్దూ నవలా సాహిత్య సృజనలో ఇదొక మైలురాయి. నేరాలూ ఘోరాలూ చేసి సమాజంలో భ్రష్టుడై Schizophrenia అనే మానసిక వ్యాధి సోకిన ఒక వ్యక్తి చెప్పుకునే కథను ఖాలిద్ అద్భుతమైన ప్రతీకలు, పదచిత్రాలతో కవితాత్మక వచనంలో అనితర సాధ్యమైన శైలిలో రాశారు. ఈ నవలపై ఉపఖండంలో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ప్రశంసలూ విమర్శలూ వెల్లువెత్తాయి. తర్వాత ఖాలిద్ రాసిన ‘నేమత్ ఖాన’ నవలకు “The Paradise of Food” పేరుతో వచ్చిన అనువాదానికి ప్రతిష్ఠాత్మకమైన జేసీబీ లిటరేచర్ - 2022 అవార్డు లభించింది. ఆయన మరో రెండు నవలలు, నాలుగు కథా సంపుటాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు వెలువరించారు. దిల్లీ జామియా మిల్లియా ఇస్లామియాలో ఉర్దూ ప్రొఫెసర్గా రిటైరైన ఖాలిద్ పలు అవార్డులు అందుకున్నారు. ‘మౌత్ కీ కితాబ్’ నవలకు తెలుగు అనువాదమే ఈ ‘మరణగ్రంథం.’

View full details